పయనించే సూర్యుడు మార్చి 19 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండలం పరిధిలోని కరీంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ వనపర్తి మల్లయ్య తల్లిదండ్రుల వనపర్తి మల్లమ్మ రాజయ్య జ్ఞాపకార్ధంగా కరీంపేట్ లోని మసీద్ కు మసీదులలో ఇఫ్తార్ విందులు, సామూహిక వంటల కోసం అవసరమైన వంట సామాగ్రి, పాత్రలను (పెద్ద పాత్రలు, గరిటెలు, ) సమకూర్చడం మత సామరస్యానికి ప్రతీక. స్థానిక మాజీ సర్పంచ్ వనపర్తి మల్లయ్య అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి మల్లయ్య రంజాన్, ఇతర పండుగల సందర్భంగా మసీదుల వద్ద ఇటువంటి వంట ఏర్పాట్లు ముస్లిం సోదరుల ఐక్యతకు దోహదపడతాయి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత-రమేష్ మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ . కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బసవయ్య గౌడ్ మాజీ ఉపసర్పంచ్ చింతం కుమారస్వామి ప్రజా ప్రతినిధులు అశోక్,అనిల్,హరీశ్,ప్రసాద్, దామోదర్,దాశి,రాజయ్య,మల్లేశం తిరుపతి ,భూమయ్య, స్వామి శంకరయ్య, భిక్షపతి ,గ్రామ ముస్లిం సోదర,సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు