రాఘవేంద్ర స్వామి సన్నిధిలో టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 రిపోర్టర్ అభి మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో అమావాస్య పర్వదినం సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా టిడిపి మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు. తిక్కారెడ్డి పూజల్లో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కృప ఎల్లప్పుడూ అందాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.