బోయకొండ గంగమ్మకు భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 21.03.2026 మదనపల్లె జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు రాహుకాల అభిషేకాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సరం రెండవ రోజున శుక్రవారం ఆలయంలో పలు కార్యక్రమాలు జరిగాయి దంపతుల సమక్షంలో అమ్మవారిని వేద పండితులు అభిషేకించారు రాహుకాల అభిషేక అనంతరం గంగమ్మను విశేషంగా అలంకరించారు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం అధికార అర్చక సిబ్బంది భక్తులకు వసతులను సమకూర్చారు