హైదర్ నగర్ ఈద్గా వద్ద ఘనంగా జరిగినముస్లిం సోదరుల ప్రార్థనలు

పయనించే సూర్యుడు, మార్చి 22 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి నియోజక వర్గంపరిధిలోని 123 డివిజన్లో ఉన్న హైదర్ నగర్ ఈద్గా శనివారం రోజు ఉదయం 9 గంటలకు వందలాదిమంది ముస్లిం సోదరులు తమ మత పెద్దల నియమ నిబంధనల తో ప్రార్థనలు చేశారు.ఈ పవిత్రమైన రంజాన్ (రమదాన్) ప్రార్థనలకు హైదర్ నగర్ తాజా మాజీనార్నే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలకు వచ్చిన వారితో అల్లాహ్ కు సుఖ శాంతులతో కుటుంబ సభ్యులందరినీ పెట్టాలని అందరితో కలిసి ప్రార్థనలో వేడుకోవడం సంభ్రం అనిపించింది. ప్రతి ఏడాది కంటే ఈసారి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలి రావడం వారికి అన్ని విధాల జిహెచ్ఎంసి నుండి సదుపాయాలను కల్పించడం జరిగిందని తెలిపారు. శాంతియుతంగా రంజాన్ ప్రార్థనలను చేయాలని కెపిహెచ్బి ఇన్స్పె క్టర్ ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తును నిర్వహించారు. హైదర్ నగర్ డివిజన్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోద రులతో కలసి నమాజ్ చేసిన తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ఓపికను అక్కడి మత పెద్దలు గ్రామస్తు లు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు, అలానే, నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్ష ణతో ఉపవాస దీక్షలు ముగించుకుని,ఈ ద్ జరుపుకుంటున్న మీ అందరి జీవితా ల్లో ఆ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పా రు.ఈ పండుగ మనందరి మధ్య సోదరభావాన్ని, శాంతిని, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తు న్నానని తెలిపారు.మీ ప్రార్థనలన్నీ ఫలిం చి, మీ కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాన న్నారు.ప్రతి ఒక్కరికి రమదాన్ ఈద్ ముబారక్ అనినార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *