పద్మశాలి నగర్ అభివృద్ధి పథంలో నడిపిస్తాం.

ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె అది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు మార్చి 24 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని నియోజకవర్గం మండగిరి గ్రామ పంచాయితీ లోని పద్మ శాలి నగర్ లోని ప్రజలు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ని కలిసి పద్మశాలినగర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుండి మా పద్మశాలి నగర్ ఎక్కడ కూడా ప్రధాన నంగా సిమెంట్ రోడ్డు కూడా లేదు విడిదిపాలు సౌకర్యాలు కల్పించాలని వివరించారు.ప్రజల సమస్యలను విన్న ఆమె, ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి 20 లక్షల రూపాయలు సిసి రోడ్డు మంజూరు చేయించారు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు నిలబడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని కృష్ణమకి చాలువ తో మరియు పూలమాలతో ఘనంగా సన్మానించారు.