చేజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆత్మకూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో మంగళవారం మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో కేంద్ర ప్రైమరీ అగ్రికల్చర్ కోపరేటివ్ సొసైటీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మస్తానయ్య మండల సొసైటీ చైర్మన్ బూదళ్ళవీర రాఘవ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ మండల వ్యవసాయ అధికారి హిమబిందు ,ఒడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ బత్తల కిష్టయ్య ,మండల బీజేపీ అధ్యక్షుడు గుండాల విజయ భాస్కర్ రెడ్డి సొసైటీ సీఈఓ ,తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్ణ రాంప్రసాద్ నాయుడు,హరీష్ చౌదరి, ఎంపిటిసి మస్తానయ్య, ఎస్సీ సెల్ నాయకులు సోమవరపు హజరత్తయ్య,బీజేపీ నాయకులు జగ్గారెడ్డి,అరవ దామోదర రెడ్డి,గడ్డం వెంకటేశ్వర్లు రైతులు పాల్గొనడం జరిగింది.ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చేజర్ల మండలం రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు