నేలకొండపల్లి మండలం మార్చి 24,2026

పయనించే సూర్యుడు 25-03-2026 సామల రామకృష్ణ నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ.. లా అండ్ ఆర్డర్.. జి ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు సమాజం నుంచి పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు యువత డ్రగ్స్ వైపు ఎప్పుడు వెళ్ళకూడదు అని భవిష్యత్ కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు ప్రభుత్వం నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతుందని తెలిపారు ఆరోగ్యంవంతమైన సమాజం నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అలాగే బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని పిల్లలను భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో నే అనే చెప్పారు ప్రతి ఒక్కరు ఉద్యమంతులైన సమాజం సన్మార్గంలో నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మి రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి కూసుమంచి సిఐ సంజీవ్ నేలకొండపల్లి ఎస్సై మీ సంతోష్ మరియు వివిధ శాఖ అధికారులు మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీత రాములు ఎండిఓ ఎర్రయ్య తదితరులు అధికారులు పాల్గొన్నారు