పయనించే సూర్యుడు మార్చి 25 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం క్రింద విజయవంతంగా పనిచేసి విద్యా లక్ష్యాలను సాధించడంలో విశేష కృషి చేసిన రిసోర్స్ పర్సన్స్ గ్రూప్ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రజితోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వట్టెం గుట్టపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి సమక్షంలో ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు 100 మంది ఈవేడుకల్లో పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా అప్పటి అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సందడి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పాల్గొన్న మిత్రులు ఆయాజిల్లాలలో తాము చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ విద్యా రంగంలో ముఖ్యంగా పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల పాత్రపై వారు చేసిన పరిశోధనాత్మక అంశాలను నెమరు వేసుకున్నారు.ఈ కార్యక్రమానికి అప్పటి నాలుగు జిల్లాల శిక్షణ ఇన్చార్జ్ గావ్యవహరించిన గాడి సురేందర్ అధ్యక్షులుగా వ్యవహరించారు.నాగర్ కర్నూలుకుచెందిన బి. వేణుగోపాల్,అడ్డాకులకు చెందిన శివకుమార్ వనపర్తికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి,కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్,పెద్దమందడికి చెందిన వరప్రసాద్, రమాకాంత్,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.