పయానించే సూర్యుడు న్యూస్ మార్చి 26 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ పొలంపల్లి గ్రామంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిస్వామి అధ్యక్షత,ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడుతూ వారికి త్వరగా ఇండ్లను పూర్తి చేయాలని ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరికీ నేను అందుబాటులోనే ఉంటాను మన గ్రామం మండల్ లోనే ఫస్ట్ గా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని మన గ్రామంలో ఇంకొందరు నిరుపేదలకు రెండో విడుత అందరికీ ఇండ్లు వచ్చేలాగా మీరు త్వరగా పూర్తిచేస్తేనే మిగతా వారికి ఇప్పటికంటే మరిన్ని ఎక్కువగా ఇండ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి మీరందరూ సహకరించుకొని త్వరగా ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయాలని వివరించారు సర్పంచ్ , పాలకవర్గం వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు