సర్పంచి నారాయణమ్మను సన్మానించిన జడ్పిటిసి పార్థసారథి

పయనించే సూర్యుడు మార్చి 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామ పంచాయితీ చేవూరి నారాయణమ్మ సర్పంచి పదవి కాలం ఏప్రిల్ 2వ తారీఖు ముగిసిపోయే సందర్భంగా గురువారం స్థానిక గ్రామ సచివాలయంలో జడ్పిటిసి పీర్ల పార్థసారథి ఆధ్వర్యంలో సర్పంచి చేవూరు నారాయణమ్మను సాల్వలతో ఘనంగా సన్మానించడం జరిగింది అలాగే వార్డు సభ్యులందరినీ సెలవులతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పిటిసి పీర్ల .పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అన్ని శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది మాకు ఎంతో అన్ని విధాల సహరించి పనిచేసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు. గ్రామ సచివాలయం సిబ్బంది. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు