శ్రీరామనవమి శోభాయాత్ర

హైదరాబాదులో రామనవమి సందర్భంగా శోభాయాత్ర.

పయనించే సూర్యుడు; తేదీ: 28 శనివారం, మార్చి 2026 పాత్రికేయులు, ఆడెపు సంతోష్ కుమార్; మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిన్న సీతారాంబాగు లో సీతారామచంద్ర లక్ష్మణ హనుమ సమేత భారీ శోభాయాత్ర. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు..! గంట గంటకు అధిక సంఖ్యలో పెరిగిన భక్తులు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు. శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై, భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, ధూల్‌పేట్, పురానాపూల్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగింది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ మార్గంలో భారీ ట్రాఫిక్ మళ్లింపులు. యాత్ర జరిగే సమయాల్లో పైన పేర్కొన్న మార్గాల్లో వెళ్లేవారు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించారు. పోలీసులు ప్రజలకు, శోభాయాత్రకు మరియు భక్తులకు పూర్తిగా సహకరించారు.