శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

పయనించే సూర్యుడు మార్చి 28 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి మండల కేంద్రంలోశ్రీ రామ నవమి సందర్బంగా పాటిమీది ఆంజనేయ స్వామి దేవాలయంలో స్థానిక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ సీతారాముల కళ్యాణంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రజలందరికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.ఆలయమంతా శ్రీ రామ నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్ ,బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు కడుదుల కరుణాకర్ రెడ్డి వాట్సాప్ లో దస్తగిరి కత్తి బిజెపి జిల్లా నాయకుడు పాలకుర్తి వార్డు సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ మండల నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.