విద్యుత్ స్తంభాలను మంజూరు చేసిన మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

పయనించే సూర్యుడు చండూరు ఏప్రిల్ 01. మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కస్తాల గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామంలో విద్యుత్ సమస్యలను మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి కస్తాల గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుపోగా మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే విద్యుత్ స్తంభాలను మంజూరు చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. కస్తాల గ్రామపంచాయతీ కి మరియు గ్రామ పంచాయతీ పరిధిలోని మెండు వారి గూడెంలో నూతనంగా కరెంటు స్తంభాలను మంజూరు చేశారు. కస్తాల గ్రామ ప్రజల విజ్ఞప్తుల మేరకు కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కరెంటు తీగల మార్పు, మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేగవంతం చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా వారు స్పష్టం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం, ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నరసింహ, 9వ వార్డు మెంబర్ దోనాల శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.