పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ ఆదోని నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ 2026-2027 ఔట్రీచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదోని శాసనసభ్యులు పార్థసారధి , కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలకు బడ్జెట్లోని ముఖ్య అంశాలు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ, సాదిక్ వలి, పులిరాజు,రాఘవరెడ్డి, భరత్ కుప్పగల హనుమంతు, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.