పయనించే సూర్యుడు 3-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ ఆవుల చందు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గోవిందు పల్లె గ్రామంలో బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎడ్లబండి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో గెలుపొందిన వారికి 1,2,3,బహుమతులు ఇవ్వడం జరిగింది. ఒకటవ బహుమతి గోవిందు పల్లె గ్రామ సర్పంచ్ మేక స్వామి 20116 రూపాయలు షేక్ అయాన్ తిరుమలాపూర్ వాస్తవ్యులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండవ బహుమతి 2007-2008, ఏడవ తరగతి క్లాస్ మెంట్స్.తిరుపతి, ఆర్ మధు, కొమురయ్య,వెంకటేష్,రేవంత్,మనోహర్,స్వామి, మణిరత్నం, మహేష్, రెండవ బహుమతి 15116 గుండు మల్లన్న శకల్ల వాస్తవ్యులకు లు ఇవ్వడం జరిగింది.అదే విధంగా మూడవ బహుమతి కోట అశోక్ గోవిందు పల్లె ఉపసర్పంచ్ మూడవ బహుమతి10116 గుడ్ల మేధానష్ వెనుగుమట్ల వాస్తవ్యులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోవింద పల్లె గ్రామ ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.