హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మారుతిరావు ఆహ్వానం మేరకు స్థానిక శక్తి గుడి టెంపుల్ ముందు ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఈ సందర్భంగా ఆమె స్వామివారికి పూజలు చేసి, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రాంత ప్రజలతో కలసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మారుతీ రావు, బెస్త ఓంకార్, బంగారు బాబు, కుప్పగల్ హనుమంతు,విజయ్, భాస్కర్ పాల్గొన్నారు.