అఖిల భారతీయ గోరక్షణ మహా సంఘం జాతీయ అధ్యక్షులు కలీం భారతి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్‌లో గో సంరక్షణ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో కీలకఅడుగుగా కనిపిస్తోంది.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 04.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) ​ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్య అంశాలు ​ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి రాష్ట్రంలో గో రక్ష మహాసంఘ్ కార్యకలాపాలను విస్తరించడం, గ్రాస్ రూట్ స్థాయి నుండి సంస్థను బలోపేతం చేయడంపై చర్చించారు. కలింభారతి మార్గదర్శకత్వం: జాతీయ అధ్యక్షులుగా ఆయన, గోవుల సంరక్షణ కోసం మైనారిటీలు మరియు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోవాలనే ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కమిటీల ఏర్పాటు మరియు గోశాలల నిర్వహణ, గోవుల అక్రమ రవాణా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం లో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అయూబ్ ఖాన్ ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వేంపల్లి అష్రఫ్, తదితరలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *