నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల బిఆర్ఎస్ నాయకులు,మిన్పూర్ మాజీ ఎంపీటీసీ బీస. గోపాల్ కుమారుడు సంతోష్ కుమార్ వివాహం సుధారాణితో మండల కేంద్రంలోని మంజీరా గార్డెన్ శుక్రవారం ఘనంగా జరిగింది. అదేవిధంగా ఎంకేపల్లి గ్రామానికి చెందిన బద్రి లక్ష్మణ్ కూతురు వివాహం పొలంపల్లి పెంటయ్య ఫంక్షన్ హాల్ సంగాయ పేట్ లో జరిగింది, మరియు అబ్లాపూర్ గుండయ్య కుమారుడి వివాహం కొత్తపల్లిలోని అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్లో జరిగింది.ఈ వివాహా వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి,మండల నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.వీరి పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు జగన్, రైతుబంధు మాజీ అధ్యక్షులు సోములు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, రామతీర్థం సర్పంచ్ సాయి రెడ్డి,మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ రావు, బద్రి. మల్లేశం,నాయకులు దుర్గయ్య, అనిల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *