పయనించే సూర్యుడు 6-04-2026-రాజంపేట న్యూస్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని టి ఎన్ ఎస్ ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ పేర్కొన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు ఆదేశానుసారం ఆదివారం పార్టీ కార్యాలయం నందు పోలి శివకుమార్ రూ 40,800 వేలు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిది ఆపన్న హస్తంలా నిలుస్తుందని, కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతోందని తెలిపారు.