పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 7 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించారు. యాడికిలో జలధార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. జల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన వివరాలను ఫొటో ఎగ్జిబిషనులో అధికారులు ప్రదర్శించారు. హార్టికల్చర్ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.