బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గమే నిజమైన రాజకీయ దిక్సూచి-ముళ్లపాటి ప్రసాద్ మాస్టర్

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 7 పెనుగంచిప్రోలు, గ్రామంలో ని ఈరోజు న బాబు జగజీవన్ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఎస్ సి సెల్ నాయకులు ముళ్లపాటి ప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, ముందుగా పెనుగంచిప్రోలు తూర్పు బజారు తిరుపతమ్మ ఆలయం ప్రక్కన వున్న అట్టు వంటి త్రిమూర్థులు బాబు జగజీవన్ రామ్, బి ఆర్ అంబేద్కర్, జ్యోతి రావ్ ప్యూలే విగ్రహాల కు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన్నారు, ఈ సందర్భంగా మాస్టరు మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గమే నిజమైన రాజకీయ దిక్సూచి అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన అచంచల పోరాటం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని, పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జయంతులు జరుపుకోవడం