మానస సత్య నారాయణస్వామి కార్యక్రమానికి హాజరైన ఎస్ ఎల్ పి కాంగ్రెస్ పార్టీఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 07 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జగదీశ్వర్ గౌడ్ , యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్, అలాగే రవి కుమార్ గౌడ్, మన్నె నరేందర్, వంశీ, రత్నాచారి, వినయ్ తదితరులు కలిసి శ్రీ రవి కృష్ణ కుమారుడు అజయ్ కృష్ణ శ్రీమతి మానస సత్య నారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం మియాపూర్‌లోని దత్త సాయి నగర్‌లో ఉన్న విజయ రెసిడెన్సీలో, కుటుంబ సభ్యులు మరియు బంధువుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ శుభ సందర్భంగా నాయకులు నూత న దంపతులకు హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేస్తూ,వారి దాంపత్య జీవితం ఆనందం, ఐశ్వర్యం,సౌభాగ్యం, ఆరోగ్యం మరియు శాంతితో నిండిపో వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీ నాయకు లు, సన్నిహితులు విశిష్ట అతిథులు హాజరై, దంపతులకు తమ ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు అందించారు.