పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 8 మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ హమాలీ జాడు దడువాయి రైతులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఎండ కాలం దృశ్య ఎండలో పనిచేస్తూ ఉన్న హమాలి జాడు కార్మికులు అలాగే అమ్మకానికి వచ్చిన రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ డైరెక్టర్ పుల్లూరు నవీన్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ఆపరేటర్ సతీష్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు