పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశిద్దామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. శనివారం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమానీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూమహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకుంటారు. సంఘ సంస్కర్త, మహిళా విద్య, కుల నిర్మూలన కోసం పోరాడిన ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారన్నారు. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన ఆయనను "మహాత్మ"గా పిలుస్తారనీ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ నివాళులర్పిస్తారన్నారు.