మాదన్న చెరువు నింపుటకు సర్వేర్ తో చర్చిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12. చండూరు మండలం కోటయ్య గూడెం గ్రామంలోని మాదన్న చెరువును నింపుటకు కనగల్ మండలం కుర్రంపల్లి కాలువ నుండి మదన్న చెరువును నింపుటకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఉడతలపల్లి, కోటయ్యగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లిఫ్టును సాంక్షన్ చేయించారు. కురంపల్లి నుంచి కోటయ్య గూడెం మాదన్న చెరువు నుండి ఉడుతల పల్లి ఊర చెరువు నింపుటకు ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వేయర్ తోటి చర్చించడం జరిగింది. కొరిమి ఓంకారం కావలి ఆంజనేయులు మేకల యాదయ్య మేకల వెంకన్న, గంట తులసయ్య , కావలి సురేష్ , మేకల రాంబాబు , విశ్వనాధ్ ,బుషిపాక శంకర్ ,సీమల భీమయ్య , కృష్ణ , గంట యాదయ్య ,కావలి నందబాబు ,శివరాత్రి ఎంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు .