పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ఆదోని రూరల్ రిపోర్టర్ కొత్త ఇళ్లపై . ఇదే.మధ్యతరగతి స్థలం ఏరియా కింద ఉన్న ప్రజలకు మంచి సువర్ణ అవకాశం సొంత ఇల్లు అంటే ఒక కళాగా మిగిలిపోయి ఉంటే వాళ్లకి చంద్రబాబు నాయుడు చేసే పనులకు ఆ కలలు నిజమయ్యే చాలా ఎక్కువనే ఉన్నాయి సందర్భంలోని శనివారం పత్రిక సమావేశంలోని మాట్లాడుతున్న గడ్డ ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఏపీ రాష్ట్ర కష్టాల్లో ఉన్న కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా చేసుకుంటా ముందుకు వెళతా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ , ప్రభుత్వం చేసే పనులకు ఈ విషయము ప్రజలకి ఎంతైనా తెలియపరచాలని మన అందరిదీ బాధ్యత. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించే వార్త తెలిపారు. కొత్త ఇళ్ల నిర్మాణంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆర్టీజీఎస్ అభివృద్ది చెందిన అవేర్ 2.0 మొబైల్ యాప్ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో మరో 5 లక్షల ఇళ్లను నిర్మించాలని, వీటిని పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. టిడ్కో ఇళ్లకు అదనంగా ఈ 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా వీటిని లబ్దిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దాదాపు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాల్సిందిగా కోరారని, వీరికి అందించేలా ప్రణాళికలు రచించాలని కోరారు. అలాగే ఒకపక్క జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మొదలెట్టారు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం చేసే పనిని 30% ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ఎట్లా ఉండేది ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభుత్వం చేసే పని జనం ఎలా ఉందా అని తెలుసుకోవాలి ప్రజలు అలాగే' 70% ప్రజల తరఫునుంచి ప్రభుత్వం పైన ఎనలేని ఆదరణ వస్తున్నందుకోసం వైసిపి నాయకులు జీవించుకోవడంలేదని గడ్డ ఫక్రుద్దీన్ విమర్శించారు.