ఆదోని జిల్లా సాధన కోసం.150వ రోజు రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయండి

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్14 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని జిల్లా సాధనకై 150వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్న సందర్భంలో 150 మంది రేపు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ఇది అంగ రంగ వైభవంగా పెద్ద ఎత్తున ఆదోని ఐదు నియోజకవర్గాల ఐక్య పోరాటవేదికగా ఆదోని జిల్లా యే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆదోని ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం ఈ ఐదు నియోజకవర్గాల ప్రాంతా ప్రజల నుండి పెద్ద ఎత్తున రేపు సీఎంకు వినిపించే విధంగా రాస్తారోకోలో వంట వార్పు నినాదాలు చేస్తూ అంతే కాకుండా విప్లవ కళాకారులు భజన కళాకారులు రంగస్థలం కళాకారులు ఇతర వృత్తి కళాకారులు ఇలా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను చాటి పాటల రూపంలో మాటల రూపంలో ఆటల రూపంలో వివిధ వేషాదాలతో రేపు జరగబోవు 150 రిలే నిరాహార దీక్ష మరియు బహిరంగ సభ ను. జయప్రదం చేయాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు వైపి నాగరాజు, పగడాల కోదండ, బండారి హనుమంతు, సుజ్ఞానమ్మ, దాసరి గోవిందు, గుమ్మల బాలస్వామి, కోరడం జరిగింది వారికి అనుకూలమైన హార్మోనియం తబలా క్యాషియో స్పీకర్స్ మొదలైనవన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న వారిని ప్రత్యేకంగా వారి పేర్లను జేఏసీలో కమిటీలో రాసుకొని ఆదోని జిల్లా ఏర్పడిన వెంటనే వారికి ఐడెంటి కార్డులో పెన్షన్ సౌకర్యము కల్పించడం జరుగుతుందని ఆదోని జేఏసీ కమిట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కావున తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ప్రజలు వారితో పాటు కళాకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను ఆటపాటల ద్వారా విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది ధన్యవాదములు