శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వద్ద భక్తుల దాహార్తిని తీర్చడానికి మంచినీటి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 14 జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వద్ద భక్తుల దాహార్తిని తీర్చడానికి మంచినీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను నందిగామ మండలం ,చింతలపాడు గ్రామానికి చెందిన ఉన్నం గిరిధర్ తాతయ్య,నాయనమ్మలైన ఉన్నం గురవయ్య, అనసూయమ్మ ల జ్ఞాపకార్థం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ వేద పండితులు దంపతులైన ఉన్నం గిరిధర్, సాయి దివ్య లతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి కానూరి సురేష్,ఆలయ ధర్మ కర్త మండలి తరుపున కెసిపి సిమెంట్ కి చెందిన రాంప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.