మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం బయటపడింది.

మహిళల పేరుతో మాటలు కాంగ్రెస్‌వి… మహిళలకు హక్కులు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం! కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ పార్లమెంట్‌లో ఒక మాట, బయట మరో మాట — ఇదే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి.”మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచింది ఎవరో దేశ ప్రజలు చూస్తున్నారు.”బిల్లు పాస్ అయ్యాక కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ అసలు స్వభావం. మహిళల ఓటు కోసమే కాదు… మహిళల భవిష్యత్తు కోసం ఎన్డీఏ పనిచేస్తోంది.”దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, నేడు అదే అంశంపై రాజకీయ నాటకాలు ఆడటం దురదృష్టకరం.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో మహిళల 33% రిజర్వేషన్చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఇది దేశ మహిళల సాధికారతకు చారిత్రాత్మక అడుగు. అయితే, ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మహిళలు ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలుస్తారనే భయంతో కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి ఈ అంశంపై అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. పార్లమెంట్‌లో ఒక విధంగా, బయట మీడియా ముందు మరో విధంగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మహిళల పట్ల నిజమైన కట్టుబాటు ఉంటే, గతంలోనే ఈ బిల్లును అమలు చేసి ఉండాల్సింది.ఈ చట్టం ఇప్పటికే ఆమోదం పొందింది. రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం జనగణన మరియు డిలిమిటేషన్ అనంతరం అమలు జరుగుతుంది. దీనిపై అనవసర రాజకీయాలు చేయడం సమంజసం కాదు.మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితే దేశ రాజకీయ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, సమగ్ర అభివృద్ధికి దారి తీస్తుంది. ఈ మార్పును అడ్డుకోవడం దేశ ప్రజాస్వామ్యానికి నష్టం. మహిళల పేరుతో రాజకీయాలు చేయడం కాదు—మహిళలకు న్యాయం చేయడం మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి మహిళల సాధికారతకు పూర్తిగా కట్టుబడి ఉంది.ప్రజలు నిజం తెలుసుకుంటారు. ఎవరు పని చేశారు, ఎవరు మాటలు మాట్లాడుతున్నారు అన్నది స్పష్టంగా గుర్తిస్తారు. గుడిసె ఆది కృష్ణమ్మ జిల్లా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ