పయనించే సూర్యుడు డిసెంబర్ 27 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓ గుర్తు తెలియని యాచక (73) సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా యాచకుడి గా ఓ వృద్ధుడు సంచారం చేస్తూ ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూన్న యాచకుడు చలి తీవ్రత ను తట్టుకోక. శుక్రవారం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పాపన్న పేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో సమాచారం అందుకున్న పాపన్న పేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా వృద్ధుడు మృతి చెందినట్లు గుర్తించి. ఆచూకీ కోసం పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతుడి శరీరంపై నీలం రంగు చొక్క ధరించి తెల్లని గడ్డం కలిగి ఉన్నాడని. మృతుడి నీ గుర్తించిన సంబంధికులు పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ 8712657920, మెదక్ రూరల్ సీఐ కార్యాలయం లో సంప్రదించాలని కోరారు