సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

పయనించే సూర్యుడు న్యూస్. డిసెంబర్ 31 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ. షకీల్) సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని బిజెపి పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఇండ్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ – ప్రజల కోసం నిర్మించిన ఇండ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇండ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.సిరిసిల్ల పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందని, అంతకుముందు ఇదే స్థలంలో ఎస్సీ కులస్తులకు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారని ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే శితిలావస్థకు చేరే పరిస్థితికి వచ్చిందన్నారు.గతంలో ఈ ఇండ్లను మొదటగా ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అప్పుడు డబల్ బెడ్ ఇండ్లను పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారని అందులో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు, కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండిపడ్డారు.కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాలి శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు, వర్ణాల శేఖర్, బాబు, అభి, కనుకయ్య, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *