
పయనించే సూర్యుడు న్యూస్, డిసెంబర్ 31 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్ఏ. షకీల్) జిల్లాలో జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన అన్నారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం, పనులలో పెట్టుకోవడం నేరమని, అలా చేస్తే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంను కఠినంగా అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే బాలల రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో మళ్లీ ఈ పిల్లలు బాల కార్మికులుగా మారకుండా వారికి పునరావాస కార్యక్రమాలు చేపట విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత వివిధ శాఖల అధికారులపై వుందని, బాల కార్మిక రహిత సమాజమే మనందరి లక్ష్యం పనిచేయాలని తెలియజేసారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, బాల కార్మికులపై ఫిర్యాదులు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు జరిగే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ డివిజన్ లలో ఎస్.ఐ స్థాయి అధికారి వివిధ శాఖల అధికారులతో రెండు టీమ్ లు ఏర్పాటు చేసి జిల్లాలో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు, హోటల్స్, వ్యాపార సముదాయాలు, గోదాములు, మెకానిక్ షాపులు, హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 18సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయుస్తున్న వారిపై 2025 సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లో 22 మందిపై క్రిమినల్ కేసులు చేసి 129 సంరక్షించడం జరిగిందని ఈసందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డి డబ్ల్యు ఓ లక్ష్మీరాజాం, సిపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
