పయనించే సూర్యుడు, అశ్వాపురం, 01-01-2026: అశ్వాపురం లోని ఎక్స్ లెంట్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నృత్యాలు, పాటలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్స్ ఖాదర్, యూసఫ్ లు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సృజనాత్మకత, ఐక్యత పెంపొందించడమే ఇలాంటి వేడుకల లక్ష్యమని ఇక్కడ భోధన చేస్తున్న ఉపాధ్యాయురాలులందరి కుటుంబాలలొ ఈ నూతన సంవత్సరం ఆనందాలు నింపాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లెనిన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరం విద్యార్థులకు కొత్త ఆశలు, లక్ష్యాలు తీసుకురావాలని, చదువుతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం బోధన సిబ్బంది పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు, సిబ్బందికి, తల్లిదండ్రులకు నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు.