శేర్లింగంపల్లి నియోజక వర్గం ప్రజలకుశుభాకాంక్షలు లను తెలియజేసిన :కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

పయనించే సూర్యుడు, జనవరి 03 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.నూత న సంవత్సరం సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు నియోజకవర్గ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్‌ని మర్యాద పూర్వకంగా కలసి శుభా కాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడు తూ నియోజకవర్గ ప్రజలందరికీ నూత న సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతు లతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.తాను అన్ని వేళలా అన్ని వర్గాల ప్రజలకు అండగా అందుబాటులో ఉంటానని తెలిపారు. అదేవిధంగా మన ప్రియతమ నాయకు డు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం చేపడుతున్న కృషిని కొనియా‌ డారు. ఈ సంవత్సరంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు లు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతంచేయాలి అని నియో జకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశా రు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి,జిల్లా మహిళా నాయకురా లు పద్మిని, మహిళా సీనియర్ నాయకు రాలు పార్వతితో పాటు నాయ కులుకావూరి ప్రసాద్, సాంబశివరావు, వెంకటయ్య, బీ కే ఎంక్లేవ్ సత్తిరెడ్డి, జర్నలిస్ట్ మారుతి కుమార్, మాణిక్యం రాజిరెడ్డి, నాగార్జున రెడ్డి, జ్యూస్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *