పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 07.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) స్థానిక హైస్కూల్ వీధిలోని చర్చి పక్కన గల గంగాధరం పెయింట్ వ్యాపారిపై పెద్ద కొండా మరి కి చెందిన శ్రీదేవి ఆమె అల్లుడు రాజేష్ రెడ్డి చిన్న కొండా మరి ఆటో డ్రైవర్ చంగల్రాయప్పలు దాడి చేసి పెయింట్ డబ్బాలు తీసుకొని వెళ్లడమే కాకుండా దుకాణాన్ని మూసివేసి తాళాలు వేశారు ఈ సంఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై నాగేశ్వరరావు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం విధితమే ఇందులో భాగంగా మంగళవారం మదనపల్లి డిఎస్పి మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితుని కలసి వివరాలను అడిగి తెలుసుకున్నారు దుకాణం లోపల బయట పరిశీలించారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎవరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్ ఎస్ఐ నాగేశ్వరరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
