పయనించే సూర్యడు జనవరి 10 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజులు నిర్వహించే భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ విశిష్ట విశిష్టతలను విద్యార్థులకు అర్థమయ్యేలా శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి చిన్నారులకు సామూహికంగా భోగి పండ్లు పోశారు పల్లె వాతావరణ కల్పించేలా గుడిస ఎడ్లబండి పంటలు ఇంటికి చేరే రైతన్న ఉత్సాహం భోగిమంటలు హరిదాసు గోదాదేవి శ్రీనివాసుడు వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు మన పండుగల విశిష్టతలను విద్యార్థులకు తెలియపరిచేందుకే ముందస్తు వేడుకలు నిర్వహించినట్టు పాఠశాల కరస్పాండెంట్ బుస మహేష్ ప్రిన్సిపాల్ బుస్సా సులోచన పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైదులు రాంబాబు లక్ష్మీ మల్లిక రజియా స్వప్న నాగమణి శిరీష వీర కుమారి సాజిదా భవాని విజయ జ్యోతి తదితరులు పాల్గొన్నారు