సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపిఎస్

పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 10 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట్ నూతన పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్., ఐపిఎస్., ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి తదనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సిహెచ్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఎసిపి నరసింహులు, హుస్నాబాద్ ఏసీపి సదానందం, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, పోలీస్ అధికారులు పోలీస్ కార్యాలయ సిబ్బంది ,అధికారులు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ కలసి మొక్కలను అందజేశారు. కమిషనర్ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి , ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అందరూ కలిసి టీం వర్క్ చేయాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, సదానందం, నరసింహులు, సుమన్ కుమార్ మరియు ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *