పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గ్రామీణా ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేది ఒక్క ఆర్ ఎం పి లే అని అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ అన్నారు. శనివారం అశ్వారావుపేట పట్టణం లోని లహరి ఫంక్షన్ హాలో జరిగిన టి ఎస్ ఆర్ ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆర్ ఎం పి డబ్ల్యు ఏ అశ్వారావుపేట మండల అధ్యక్షులు షేక్ ఉస్మాన్ (బాబా) అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ గ్రామాల్లో అర్ధరాత్రి అప రాత్రి అనే తేడా లేకుండా ఎవరు పిలిచిన వెళ్ళి వైద్యం అందిస్తూ వారి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ఎవరో కొద్ది మంది తమ పరిధులు దాటి వైద్యం చేస్తున్నారని, అటువంటి వైద్యాలు చేయవద్దు అని, రిస్క్ తీసుకోవద్దని తెలిపారు. ఆర్ ఎం పి లు ఎన్నికల్లో ఎంతో తోడ్పాటును అందించారని అన్నారు. ఆర్ ఎం పి ల సమస్య పై ప్రభుత్వం తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.అందరూ ఏకతాటిపై ఉండి ముందుకు సాగాలని కోరారు. అనంతరం అసోసియేషన్ జిల్లా బాధ్యులు మాట్లాడుతూ ఐ ఎమ్ సీ దాడులు ఎక్కువ అయ్యాయని, ఆర్ ఎం పి ల్లో ఉన్న సంఘాల ఒక్కటై ఉద్యమించాలన్నారు. భవిషత్ లో ఆర్ ఎం పి ల వైద్యాలు చేసే పరిస్థితి కూడా ఉండదని, దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రం, తుమ్మా రాంబాబు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సంఘం నాయకులు బండి కొమరయ్య, శ్రీనివాసరావు, చిన్ని, రమేష్, దమ్మ పేట మండల అధ్యక్షులు వాహెబ్, ఆర్ ఎం పిలు పాల్గొన్నారు.
