పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 4 బోధన్ : బోధన్ పట్టణ కేంద్రంలో మంగళవారం హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ శరత్ రెడ్డి యువకులతో పట్టణ వాసులతో ఆనందంగా జరుపుకున్నారు. పట్టణంలోని మహిళలు చిన్నారులు ఉదయం నుంచి రంగులు పోసుకొని సంబరాలు,జరుపుకున్నారు.ఒకరికి ఒకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రంగులు పూసుకున్న యువకులు ఓక్క దగ్గరికి చేరి స్మార్ట్ ఫోన్లతో సెల్ఫీలు దిగారు.విందులు చేసుకున్నారు.ఈ సంబరాలలో కౌన్సిలర్ శరత్ రెడ్డి, తలారి నవీన్, పట్టణ యువకులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.