పొలంపల్లి రామకోటయ్య పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాళి

పయనించే సూర్యడు మార్చి 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ప్రముఖులు, అందరి ఆదరణ పొందిన వ్యక్తి పొలంపల్లి రామకోటయ్య అనారోగ్యంతో మృతి చెందగా, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శనివారం వారి గ్రామాన్ని సందర్శించారు. ​రామకోటయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రామకోటయ్య మృతి ఈ ప్రాంతానికి మరియు వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ శాఖకు చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *