మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గీతం విడుదల

* గానం పాలమూరు జయప్రకాష్ సాహిత్యం రెడ్డిపాకుల శ్రీశైలం

పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గొప్పతనం, సమాజంలో వారి పాత్రను ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ గీతానికి రెడ్డెపాకుల శ్రీశైలం సాహిత్యం అందించగా, పాలమూరు జయప్రకాశ్ హృద్యంగా ఆలపించారు. మహిళల సాధికారత, వారి కష్టాలు మరియు విజయాలను ప్రతిబింబించేలా ఈ గీతం రూపొందించబడింది. ఆర్‌ఎస్‌టీవీ మ్యూజిక్ జనని ద్వారా విడుదలైన ఈ పాటను అందరూ వీక్షించి ఆదరించాలని నిర్వాహకులు కోరారు. అలాగే ఈ గీతంపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎస్‌టీవీ మ్యూజిక్ జనని చానల్‌ను సభ్యత్వం పొందుతూ ఇతరులకు పంచుకోవాలని కూడా కోరారు. గానం: పాలమూరు జయప్రకాశ్ సాహిత్యం: రెడ్డెపాకుల శ్రీశైలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *