వేలంపాట ద్వారా 24.10 ఆదాయం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 18.03.2026 మదనపల్లి అన్నమయ్య నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహించిన వేలంపాట ద్వారా రూ 24,10,000లు ఆదాయంగా సమకూరిందని ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు మంగళవారం కొండపై 5 వనరులకు గాను నిర్వహించిన వేలంపాటలో అమ్మవారి ఆలయం ముందు పెద్ద భోగము మొక్కుబడి రుసుము నిర్వహించుకును హక్కును సోమశేఖర్ హెచ్చుగా పడి పాటను దక్కించుకున్నట్లు ఆయన వివరించారు తక్కిన నాలుగు వనరులు సరైన వేలంపాట రానందున వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ ఆలయ అధికార ఆర్చక సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *