పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 21 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ)ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఎసీబీఐ) తెలుగు రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ గా మాచారి నాగ మృత్యుంజయ శర్మ నియమించబడ్డారు.ఈ మేరకు ఏలేశ్వరం మండలం వేద గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు శర్మను దుస్సాలువతో శుక్రవారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అవసరాల కిషోర్,కవికొండల రవి,చెన్నాప్రగడ గోపి,నాగ సిద్ధాంతి,ఇంజరపు సత్య రామ గోపాల్,చల్లా కృష్ణమూర్తి,ఉడతల రమణారావు,నూకల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.