గ్యాస్ సరఫరాలోనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

* గృహ వినియోగదారులకు ఇబ్బందులు రావొద్దు * గ్యాస్ గోదామును తనిఖీ చేసిన * జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

పయనించే సూర్యుడు మార్చి 25 కరీంనగర్ న్యూస్: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. సీతారాంపూర్ లోని నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాములో మంగళవారం ఆకస్మిక చేశారు. గృహ వినియోగదారుల, వాణిజ్య పరమైన సిలిండర్ల బుకింగ్, స్టాక్ నిల్వలు, రోజు వారీ సరఫరా తదితర వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆస్పత్రులకు సరఫరా అవుతున్న సిలిండర్లు, వాణిజ్యప్రమైన, గృహ అవసరాల సిలిండర్ల సరఫరా వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. స్టాక్ నిలువలు, బుకింగ్ సంఖ్య తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి తెలియజేయాలని డీలర్లకు సూచించారు కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *