పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. రాజ్యసభలో చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా బిల్లు పాస్ అవ్వడంతో రాష్ట్రమంతా కూటమి నాయకులు బైక్ ర్యాలీతో జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో జై కొట్టినారు అలాగే ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించి అమరావతి రాజధానికి మద్దతు తెలిపినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి జీవనాడి ఇది రాజధాని మాత్రమే కాదు దైవ సంకల్పంతో కూడిన తెలుగు ఆత్మగౌరవం రైతుల రాజధాని మహిళల భావాలను గౌరవించేలా రాజధాని అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు బోయరాగప్ప మల్లికార్జున రెడ్డి దశరథ్ రెడ్డి పూజారిశప్ప కుప్పం సోమలింగం గర్జప్ప బీరప్ప సెకప్ప రంగా కొండయ్య మనప్ప మరియు కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.