రంగంపేటలో అమరావతే మన రాజధాని నినాదంతో ఇసుక శిల్పం ప్రదర్శనం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి వర్ధిల్లాలనే ఆకాంక్షతో రంగంపేట మండల కేంద్రంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం, ప్రముఖ ఇసుక శిల్పి దేవిన శ్రీనివాస్ తన నివాసంలో అమరావతి రాజధాని ఆకృతిని ప్రతిబింబించేలా అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించారు.రాజధానిపై అవగాహన:”మన రాజధాని – మన అమరావతి” అనే నినాదంతో రూపొందించిన ఈ శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమికి చెందిన పలువురు కీలక నేతలు హాజరై అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. రాజధాని నిర్మాణ ఆవశ్యకతను మరియు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని నేతలు పేర్కొన్నారు.పాల్గొన్న ముఖ్య నేతలు:ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు వుండవిల్లి బాబురావు, వుండవిల్లి గంగాధరం, ప్రస్తుత రంగంపేట పీఏసీఎస్ అధ్యక్షులు గారపాటి రాంబాబు, బూత్ ఇంచార్జ్ మల్లిపూడి వెంకటరమణ చౌదరి, నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.అలాగే మాజీ గ్రంధాలయ చైర్మన్ వుండవిల్లి శ్రీనివాస్, బిజెపి నాయకులు వుండవిల్లి మాణిక్యం, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మండవిల్లి గుప్తా, టిడిపి నాయకులు దుబాసి వరప్రసాద్, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు అంచూరి సహదేవుడు, 129 బూత్ ఇంచార్జ్ వుండవిల్లి శివప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు పోతుల చిన్ని కాపు, రాజమహేంద్రవరం జిజిహెచ్ డెవలప్మెంట్ మెంబర్ యలమటి రాంబాబు, రంగంపేట టిడిపి సెక్రటరీ సరికొండ వీరనారాయణ తదితరులు పాల్గొని దేవిన శ్రీనివాస్ మరియు వారి కుమార్తెలు (దేవిన సిస్టర్స్) సోహిత, ధన్యతలను అభినందించారు.చివరగా రంగంపేట మండల ఎన్డీయే కూటమి నాయకులు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *