లుంబిని విద్యాలయం నందు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు జనవరి 10 ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య చేజర్ల మండలం లుంబిని విద్యాలయం నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలు లో భాగంగా విద్యార్ధినులు చే ముగ్గుల పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన బాలికలకు ప్రథమ , ద్వితీయ మరియు తృతీయ బహుమతి ప్రదానోత్సవం చేయుట జరిగింది. భోగి మంటలేసి అనంతరం విద్యార్ధిని విద్యార్థులచే కోలాటం మరియు సాంకృతిక కార్యక్రమములో భాగంగా హరిదాసులు, గంగిరెద్దులు వారి వేషాలతో పిల్లలు అలరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *