పయనించే సూర్యడు ఏప్రిల్ 10 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరపతమ్మ సుధీర్ అత్త వేపూరి చిట్టెమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా నడిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. సర్పంచ్ దున్న శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో మందుల రాంబాబు, కుంచం ఉపేందర్, వంశీ, వెంకటాచారి, లక్ష్మణ్, లింగయ్య తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.