పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. రోడ్డు భద్రత చర్యలలో భాగంగా, ఆదోని రూరల్ సీఐ నల్లప్ప ఆధ్వర్యంలో, ఈస్వీ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ కుమార్ , సిబ్బంది కలిసి ఆదోని–ఆలూరు సిరిగుప్ప రహదారులపై వాహనాల వేగ నియంత్రణ కోసం మొత్తం 12 స్పీడ్ స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాపర్లు ధనపురం, నారాయణపురం, సంతకుళ్లూరు గ్రామాల రోడ్ల వద్ద ఏర్పాటు చేయబడినట్లు ఎస్ఐ మహేశ్ కుమార్ తెలిపారు.గ్రామాల సమీపంలో వాహనాల వేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు నివారించబడతాయని పేర్కొన్నారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసులు కోరారు.
