పయనించే సూర్యుడు, ఏప్రిల్ 11 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ ఈరోజు గోపీనగర్, సుదర్శన్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు బీఆర్ఎ స్ పార్టీ నాయకులు మారబోయిన రవి యాదవ్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ చేరిక కార్యక్రమం భీమేష్ మరియు గౌతమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నూతన సభ్యులకు మార బోయిన రవి యాదవ్ పార్టీ కండువా కప్పి హృదయ పూర్వక స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, అదే నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీని యర్ నాయకులు కే ఎన్. రాములు, సురేష్, ప్రభాకర్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, సాయి నందన్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, సత్యనారాయణ, రాజు చారి, బల్ రాజ్, కిట్టు, అజయ్ కుమార్ గౌడ్ , నరేష్ , పవన్ , శ్రీకాంత్ , పునీత్, అజయ్ సాయితేజ, అబ్దు ల్ ,శివ ,అనీష్,నగేష్,సాయికుమార్, సాయి కమల్, వంశీ,తదితరాలు పాల్గొన్నారు.